కూతురి వెర్రి పని... సూపర్‌ డాడీ సాహసం, వైరల్‌ వీడియో | Dad shields his daughter with his body after she fell railway platform video viral | Sakshi
Sakshi News home page

కూతురి వెర్రి పని... సూపర్‌ డాడీ సాహసం, వైరల్‌ వీడియో

Jun 17 2025 5:41 PM | Updated on Jun 17 2025 6:16 PM

Dad shields his daughter with his body after she fell railway platform video viral

రైల్వేస్టేషన్‌లో అప్రమత్తంగా ఉండాలని అటురైల్వే అధికారులు,ఇతరులు చెబుతూనే ఉంటారు. రైలు రన్నింగ్ లో ఉండగానే దిగేందుకు   ఎక్కేందుకు ప్రయత్నించవద్దని,  రైలు వస్తున్నపుడు  ప్లాట్‌ఫాం కు దూరంగా ఉండాలనే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. చాలా మంది అప్రమత్తంగానే ఉంటారు. కానీ. ఒక్కోసారి ఊహించని పరిణామాలు మనల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. అలాంటి ఘటన ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.  అత్యంత సాహసంతో కన్నబిడ్డను కాపాడి సూపర్‌ హీరో అయిపోయాడో తండ్రి. పూర్తి వివరాలు తెలియాలంటే.. ఈ వైరల్‌ వీడియోను చూడాల్సిందే.  ఈ కథనం కూడా పూర్తిగా చదవాల్సిందే.

రైల్వే స్టేషన్‌ అనగానే కొంతమందికి గాభరా. కొంతమందేమో  చాలా  లైట్‌ తీసుకుంటారు. అలా రైలు  పట్టాల మీద ఉన్న కూడా ఒక ప్లాట్ ఫామ్ మీద మరోప్లాట్ ఫామ్ మీదకు వెళ్లేందుకు  ప్రయత్నించింది. ఏ  మాత్రం ప్రాణ భయం లేకుండా ఒక యువతి ఒక ప్లాట్ ఫామ్ మీద నుంచి మరోక చోటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలోనే  అటువైపు వేగంగా  రైలు దూసుకొచ్చింది. కళ్లు మూసి తెరిచే లోపే ఆమె పట్టాలు, రైలుకి మధ్యలో ఇరుక్కపోయింది.  దీన్ని గమనించిన ఆమె తండ్రి అంతే వేగంగా కదిలాడు. వెంటనే పట్టాల మీదకు దూకి ప్లాట్ ఫామ్ వైపు  కిందికి దూకి కూతుర్ని గట్టిగా హత్తుకున్నాడు.  ఈ సమయంలో ట్రైన్ కూడా వేగంగా  ముందుకు వెళ్లిపోయింది.  అదృష్టవశాత్తూ వారుకి ఎలాంటి గాయాలు కాకుండా భారీ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.  దీంతో అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. కొంతమంది భావోద్వేగానికి గురై దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా లిప్త పాటులో ప్రాణాలు పోయేవే.  దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌  వైరల్‌గా మారింది.  లక్షల మంది షేర్‌ చేశారు. దాదాపు  కోటి (9.7 మిలియన్లు) వ్యూస్‌ దక్కించుకుంది.

కన్నబిడ్డకోసం తండ్రి చేసిన సాహసం, తండ్రి చూపిన ప్రేమను  చూసి సూపర్‌ డాడ్‌ అంటూ పొగిడేస్తున్నారు. పిల్లల కోసం తల్లిదండ్రుల అసామాన్య త్యాగాలు అంటూ ఎమోషనల్‌ అవుతున్నారు.  తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు మరొక వినియోగదారు  వ్యాఖ్యానించారు, "ఈ వీడియో చూసిన తర్వాత నా కళ్ళు చెమ్మగిల్లాయని మరొకరు కామెంట్‌  చేశారు. "మరికొందరు మాత్రం ఇది అవసరమా, ఏదైనా తేడా వస్తే పరిస్థితి ఏంటి? అంటూ మండిపడుతున్నారు.

ఇదీ చదవండి: Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడు

అసలు విషయం ఏమిటంటే..
అయితే, ఈ సంఘటన జనవరి 27, 2020న ఈజిప్టులోని ఇస్మాయిలియాలో జరిగింది. ఈ ఘటన  ఎక్కడ జరిగినా రైల్వే ప్రయాణాల్లో మాత్రం అప్రమత్తత అవసరం అని  ఈ సంఘటన రుజువు చేస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement