న్యాయం గెలిచింది | - | Sakshi
Sakshi News home page

న్యాయం గెలిచింది

Aug 25 2025 8:15 AM | Updated on Aug 25 2025 8:15 AM

న్యాయ

న్యాయం గెలిచింది

న్యాయం గెలిచింది పోలీసుల తీరు మారాలి ఇదేం పాలన ? ప్రజలంతా గమనిస్తున్నారు

చాటపర్రు సర్పంచ్‌ గుడిపూడి రఘు అక్రమ అరెస్ట్‌, రిమాండ్‌ విషయంలో న్యాయం గెలిచింది. అక్రమ కేసులు, అరెస్ట్‌లు ఎన్నటికీ నిలబడవు. అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటాం.

– తేరా ఆనంద్‌, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు

పోలీసుల తీరు మారాలి. న్యాయస్థానాలు వరుసగా ఆగ్రహం వ్యక్తం చేసి మెమోలిస్తున్నా ఒకే విధానంలో కే సులు నమోదు చేయడం బాధాకరం. పోలీస్‌ శాఖ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలి.

– అప్పన ప్రసాద్‌, దెందులూరు ఏఎంసీ మాజీ చైర్మన్‌

మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బ య్యచౌదరి తోటల్లోకి టీడీపీ శ్రేణులు అక్రమంగా చొరబడ్డారు. పంటను నష్టపరిచి, దాడులు చేశారు. తిరిగి వైఎస్సార్‌సీపీ నాయకులపైనే కేసులు పెడుతున్నారు. ఇదేం పాలన.

– బత్తుల యేసు రాజు, వైఎస్సార్‌సీపీ పెదపాడు మండల నేత

టీడీపీ శ్రేణుల దాడులు, దౌర్జన్యాలను ప్రజలంతా గమనిస్తున్నారు. అధికారం ఉంటే ఎదుటివారిపై అక్రమ కేసులు బనాయిస్తారా. గతంలో మేం ఎవరి తోటల్లోకైనా వెళ్లామా, దాడు లు, దౌర్జన్యాలు చేశామా.

– అక్కినేని రాజశేఖర్‌, పెదపాడు సొసైటీ మాజీ చైర్మన్‌

న్యాయం గెలిచింది  
1
1/3

న్యాయం గెలిచింది

న్యాయం గెలిచింది  
2
2/3

న్యాయం గెలిచింది

న్యాయం గెలిచింది  
3
3/3

న్యాయం గెలిచింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement