16న ప్రైవేట్‌ పాఠశాలల సమస్యలపై చర్చ | - | Sakshi
Sakshi News home page

16న ప్రైవేట్‌ పాఠశాలల సమస్యలపై చర్చ

Aug 11 2025 6:37 AM | Updated on Aug 11 2025 6:37 AM

16న ప్రైవేట్‌ పాఠశాలల సమస్యలపై చర్చ

16న ప్రైవేట్‌ పాఠశాలల సమస్యలపై చర్చ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చీరాలలో ఈనెల 16న జరిగే అపుస్మా (ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రైవేట్‌ పాఠశా లల యాజమాన్యాల సమస్యలపై చర్చిస్తా మని అపుస్మా రాష్ట్ర అధ్యక్షుడు కె.తులసీ ప్ర సాద్‌ తెలిపారు. ఆదివారం స్థానిక శ్రీశ్రీ పా ఠశాలలో నిర్వహించిన జిల్లా కార్యనిర్వాహక కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వి ద్యాహక్కు చట్టం ప్రకారం అడ్మిషన్‌ పొందిన వారికి ప్రభుత్వం కొత్త బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేసుకోమనడం సరికాదదన్నారు. స్టార్‌ రేటింగ్‌ ప్రకారం కేవలం రూ.8 వేలు ఫీజులుగా ఇస్తామంటున్నారని, తల్లికి వందనం ఉచిత విద్యలో భాగమే కాబట్టి విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రవేశాలు పొందిన వారికి కనీసం రూ.13 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర అదనపు ప్ర ధాన కార్యదర్శి ఎంబీఎస్‌ శర్మ మాట్లాడుతూ యాప్‌లు, బోధనేతర పనులను ఉపాధ్యాయులకు కేటాయించడం, ట్రాన్స్‌పోర్ట్‌, గ్రీన్‌ టాక్స్‌ వంటి సమస్యలపై చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. అపుస్మా రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు జంగా బాలాజీ, జిల్లా అధ్యక్షుడు ఎం.శివకుమార్‌ శర్మ, కార్యదర్శి ఎన్‌ఆర్‌కేఏ ప్రసాద్‌, కోశాధికారి కె.రామకృష్ణ, వివిధ జోన్ల అధ్యక్షులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement