
కొందరికే అన్నదాత సుఖీభవ!
సాగు భారమైంది.. మామిడి ధర భారీగా పతనమైంది.. కోకో ధర నేలచూపులు చూస్తోంది.. పొగాకు, మిర్చి, వాణిజ్య పంటలతో పాటు ధాన్యానికి సైతం గిట్టుబాటు ధర లేక అన్నదాత ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఏడాది క్రితం వరకు రికార్డు స్థాయిలో ధరలు పలికిన పంటలు పతనం కావడం, పెట్టుబడులు పెరగడం, అప్పుల తిప్పలతో అన్నదాత సుఖీభవ సాయంపై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగిలింది. జిల్లాలో 40 శాతానికిపైగా రైతుల సంఖ్యలో కోత విధించి అర్హుల జాబితాను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. అయినా పథకం అమలు, ఎప్పుడు సాయం జమ చేస్తారనే దానిపై స్పష్టత లేదు.
శురకవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉమ్మడి పశ్చిమ రాష్ట్రంలోనే ఖ్యాతి గడిచింది. ప్రధానంగా ఏలూరు జిల్లాలో వరి సాగు అత్యధికంగా ఉంటుంది. దీంతో పాటు ప్రధాన వాణిజ్య పంట అయిన కోకో, మామిడి కూడా సాగు విస్తీర్ణంలో జిల్లానే రాష్ట్రంలో నంబర్వన్. ఇక పొగాకు, ఇతర వాణిజ్య పంటలు కూడా జిల్లాలో గణనీయంగా సాగులో ఉన్నాయి. ఈ పరిణామాల క్రమంలో గతేడాదిగా ధాన్యంతో సహా పంటలకు ఆశించిన ధరలు లేకపోవడంతో అన్నదాత అగచాట్లు పడుతున్నాడు. ప్రధానంగా జిల్లాలో 1.91 లక్షల ఎకరాల్లో వరిసాగు ఉంది. అలాగే 36,156 ఎకరాల్లో కోకో, 52 వేల ఎకరాల విస్తీర్ణంలో మామిడి, 33 వేల ఎకరాల్లో పొగాకు సాగవుతోంది. గతేడాది రూ.1,150 పలికిన కిలో కోకో గింజలు ప్రస్తుతం కిలో రూ.300 నుంచి రూ.400కు పరిమితమైంది. అలాగే గతేడాది రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలికిన టన్ను మామిడి ప్రస్తుతం రూ.10 వేలకే పరిమితమై సీజన్ ముగింపులో ఉంది. మామిడి రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. అలాగే పొగాకు కూడా ధరలు భారీగా పతనమయ్యాయి. కిలో రూ.411 పలికిన గ్రేడ్–1 పొగాకు నేడు రూ.270కు పరిమితమైంది. ఇలా వరుసగా ప్రధాన పంటలు ధరలు పతనమయ్యాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా పథకానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినా ఏడాది పాటు పట్టించుకోలేదు. ఖరీఫ్, రబీ సీజన్లు ముగిసినా పథకం ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో జిల్లాలో గందరగోళం నెలకొంది.
1.62 లక్షల మందికే అన్నదాత సుఖీభవ
ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ అమలుపై స్పష్టమైన ఆదేశాలు అందలేదు. అయితే అర్హుల జాబితాను స్థానిక యంత్రాంగం సిద్ధం చేసింది. గత ప్రభుత్వ హయాంలో 2.35 లక్షల మందికి రైతు భరోసా సాయం అందితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 1,62,085 మందిని మాత్రమే అన్నదాత సుఖీభవకు అర్హులుగా గుర్తించారు. ఈ లెక్కన జిల్లాలోని 64,873 మందికి పథకం వర్తించదు. అలాగే జిల్లాలో ఇప్పటివరకూ 1,56,461 మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 3.42 లక్షల మంది రైతులు ఉన్నారు.
న్యూస్రీల్
రైతులను దగా చేశారు
దేశానికి అన్నం పెట్టే రైతులను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి తగదు. ఎన్నో ఆశలు పెట్టుకుని రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూశారు. పాలన చేపట్టి ఏడాది అయినా రైతులకు ప్రభుత్వ సహాయం అందలేదు. నిర్దిష్టమైన ప్రకటన చేయలేదు. పెట్టుబడి సాయం కోసం అప్పులు తెచ్చుకుని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితికి రైతులు వచ్చారు.
– కొలుసు గణపతిరావు,
రైతు సొసైటీ మాజీ చైర్మన్ దెందులూరు
గతంలో రైతే రాజు
గత వైఎస్సార్సీపీ ప్రభు త్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతును రాజుగా చేశారు. బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేశారు. ఏటా వ్యవసాయ సీజన్ సమయానికి పెట్టుబడి సాయం అందించారు. రైతులు, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేశారు.
– ఎం.రంగబాబు,
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కర్షకులపై కక్ష
జిల్లాలో కొందరు రైతులకే వర్తింపు
అర్హుల జాబితా సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం
కౌలు రైతులకు దక్కని భరోసా
40 శాతం మేర తగ్గిన లబ్ధిదారులు
గత ప్రభుత్వంలో జిల్లాలో 2.24 లక్షల మందికి పథకం
కూటమి ప్రభుత్వంలో 1.62 లక్షల మందికే వర్తింపు
పథకం అమలుపై లేని స్పష్టత
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.1,830 కోట్ల సాయం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ రైతుభరోసా పేరుతో ఏటా మూడు విడతల్లో ప్రతి రైతుకూ నగదు జమ చేసేవారు. జిల్లాలో నాలుగేళ్లలో 2 లక్షల మందికిపైగా రైతులకు రూ.1,830 కోట్ల సాయం చేశారు. అలాగే సున్నా వడ్డీ రుణాల కింద రూ.22.29 కోట్ల లబ్ధి చేకూర్చారు.

కొందరికే అన్నదాత సుఖీభవ!

కొందరికే అన్నదాత సుఖీభవ!

కొందరికే అన్నదాత సుఖీభవ!