
సార్వాకు సన్నద్ధం
భీమవరం: జిల్లాలో రైతులు సార్వా వరి సాగుకు సమాయత్తమవుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో కొన్నిచోట్ల నారుమడుల పనులు చేస్తుండగా.. మరికొందరు విత్తనాల సేకరణ, దుక్కుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో సార్వా సీజన్లో 2.08 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనుండగా, ఈ మేరకు 10,400 ఎకరాల్లో నారుమడులు వేయాల్సి ఉంది. ఇప్పటివరకు దాదాపు 1,500 ఎకరాల్లో నా రుమడులు పూర్తిచేసినట్టు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. గత దాళ్వా సాగు చేపట్టిన రైతులు ధాన్యం అమ్మకాల సమయంలో మిల్లర్లు, ధాన్యం కమీషన్ ఏజంట్లు పంటకు తక్కువ ధర చెల్లించడంతో తీవ్రంగా నష్టపోయారు. నేటికీ కోట్లాది రూపాయలు ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉండటంతో ప్రస్తుత సార్వా సాగు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
52 వేల క్వింటాళ్ల విత్తనాల అవసరం
జిల్లాలో వరి సాగుకు 52,500 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా దాదాపు 41,600 క్వింటాళ్లు రైతుల వద్దనే ఉంటాయనే అంచనా. 225 క్వింటాళ్ల విత్తనాలను వ్యవసాయ శాఖ సబ్సిడీపై రైతులకు అందించనుంది. 4,600 క్వింటాళ్ల విత్తనాలు ప్రైవేట్ డీలర్ల వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. సన్న రకాలను ప్రోత్సహించేందుకు ఎంటీయూ 1262 రకం వరి విత్తనాలను అన్ని మండలాల్లో దాదాపు 175 ఎకరాల్లో విత్తన పంటగా వేయించడానికి అధికారులు కృషి చేస్తున్నారు.
58,900 టన్నుల ఎరువులు
జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో సాగుకు 58,905 టన్నుల ఎరువులు అవసరముంటుంది. దీనిలో యూరియా 20,990 టన్నులు, కాంప్లెక్స్ 35,059 టన్నులు, డీఏపీ 2,700 టన్నులు అందుబాటులో ఉన్నాయి. వరిపైరుపై నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించడానికి జిల్లావ్యాప్తంగా 2 లక్షల ఎకరాలకు అవసరమైన నానో యూరియా, డీఏపీ ప్రైవేట్ మార్కెట్లో అందుబాటులో ఉంచారు.
భూసారాన్ని బట్టి ఎరువులు వాడాలి
అధికంగా ఎరువులు వాడకాన్ని తగ్గించడానికి రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు భూసార పరీక్షల కార్డులు అందిస్తున్నారు. వీటి ఫలితాల ఆధారంగా ఎరువులు వినియోగించడం ద్వారా అధిక దిగుబడులకు అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా ఈ ఏడాది 16,150 మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలకు తాడేపల్లిగూ డెం ల్యాబ్కు పంపించారు. వ్యవసాయ భూముల్లో నత్రజని, కర్బన శాతం, జింకు తక్కువగా గుర్తించారు. ఈ మేరకు రైతులకు భూసార పరీక్షల కార్డులు అందించి వాటి ఆధారంగా ఎరువులు వాడకంపై అవగాహన కల్పించనున్నారు.
జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో వరి సాగు
10,400 ఎకరాల్లో నారుమడులకు 1,500 ఎకరాల్లో పూర్తి
అందుబాటులో విత్తనాలు, ఎరువులు
ముందస్తు నాట్లతో మేలు
సార్వా పంటకు ముందస్తు నాట్లు వేయడం వల్ల మంచి దిగుబడులు సా ధించవచ్చు. ఇప్పటికే కా లువల్లో సంవృద్ధిగా నీరు ఉంది. వాతావరణం కూడా అనుకూలంగా ఉన్నందున రైతుల త్వరితగతిన నారుమడులు వేసుకోవాలి. దాదాపు 1,500 ఎకరాల్లో నారుమడులు పూర్తయ్యాయి. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి.
– జెడ్.వెంకటేశ్వరరావు,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి, భీమవరం

సార్వాకు సన్నద్ధం