
23న వైఎస్సార్సీపీ యువత పోరు
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడచినా హామీల అమలులో ఘోర వైఫల్యంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని, సూపర్–6 హామీల్లో నిరుద్యోగ భృతి ని అమలు చేయలేదని.. నిరుద్యోగ యువత, విద్యా ర్థుల పక్షాన వైఎస్సార్సీపీ పోరుబాట పట్టినట్టు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) తెలిపారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఈనెల 23న చేపట్టనున్న వైఎస్సార్సీపీ యువత పోరు పోస్టర్లను ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ తో కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ కూటమి నాయకులు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే వీటిని అమలు చేయకుండా ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు. మరోవైపు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వీటిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఈనెల 23న ఏలూరులో వైఎస్సార్సీపీ యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్కు చేరుకుంటామని, అక్కడ దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం శాంతియుత ర్యాలీ చేపడతామన్నారు. అక్కడి నుంచి కలెక్టరేట్కు చేరుకుని ధర్నా, కలెక్టర్కు వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్, జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరువుతారని చెప్పారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ ఏలూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పాతినవలస రాజేష్, ఏలూరు నగర యువజన అధ్యక్షుడు గంటా సాయిప్రదీప్, కై కలూరు నియోజకవర్గ యువజన అధ్యక్షుడు చార్లెస్, పోలవరం నియోజకవర్గం యువజన అధ్యక్షుడు తోట జైబాబు, దెందులూరు నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పెద్దిరాజు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాసరావు, యువజన విభాగం కార్యదర్శి కిట్టు, రాష్ట్ర కార్యదర్శి గాలి వెంకటేష్, నగర బీసీ సెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, రాష్ట్ర వాణిజ్య సెల్ ప్రధాన కార్యదర్శి గంటా మోహన్రావు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, నాయకులు సురేష్, జానంపేట బాబు, బండ్లమూడి సునీల్, దినేష్, శ్యామ్ పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ వెల్లడి
గత ప్రభుత్వంలో పక్కాగా ఫీజు పథకం
ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున 13 నెలల కాలానికి రూ.36 వేల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పక్కాగా అమలుచేస్తే కూటమి ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని మాట్లాడుతూ ఏలూరులో యువత పోరు కార్యక్రమానికి రాష్ట్ర యువజన అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరవుతారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఏడాది గడిచినా కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని విమర్శించారు.