
5,616 వేదికల్లో యోగా
ఏలూరు(మెట్రో): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం జిల్లాలో పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని, జిల్లాలోని 5,616 వేదికల్లో, 9 లక్షల మందికి పైగా ప్రజలు యోగాభ్యాసనలో పాల్గొంటున్నారని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 9,59,635 మంది యోగాంధ్ర యాప్లో నమోదు చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీల్లో స్కిట్ అండ్ రోల్ ప్లే, యోగా స్లొగన్స్ విభాగాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. విజేతలకు విశాఖలో ప్రధాని మోదీ చేతులమీదుగా బహుమతులు అందిస్తారన్నారు. ఏలూరులోని సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశా ల గ్రౌండ్స్, ఇన్డోర్ స్టేడియం, అల్లూరి సీతారామరాజు స్టేడియం ప్రాంతాల్లో ఒక్కోచోటా 5 వేల మంది యోగాభ్యాసన చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. జేసీ పి.ధాత్రిరెడ్డి పాల్గొన్నారు.
రహదారుల నిర్మాణంపై సమీక్ష
ఏలూరు(మెట్రో): జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా భూసేకరణ, తదితర సమస్యలను అధిగమించి త్వరితగతిన రహదారుల నిర్మాణం జరిగేలా చూడాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం అధికారులతో ఆమె సమీక్షించారు. పట్టిసీమ–జీలుగుమిల్లి 365 బి.బి. 40 కి.మీ. రహదారికి సంబంధించి త్వరగా భూసేకరణ చేసి నిర్మాణదారులకు స్వాధీనం చేయాలని ఆదేశించారు. అలాగే ఖమ్మం, దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి సంబంధించి ఆయా అంశాలపై సమీక్షించారు. తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి రైతులకు నష్టపరిహారం త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొయ్యలగూడెం పరిధిలోని రైతుల కు పరిహారం చెల్లించి రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని నిర్మాణదారులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పామర్రు–ఆకివీడు 165 జాతీయ రహదారికి సంబంధించి గోనేపాడు వద్ద ఆర్వోబీ నిర్మాణానికి అవసరమైన భూమి విషయంలో రైతులతో సమన్వయం చేసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ఉత్తమ సేవలతోనే గుర్తింపు
ఏలూరు(మెట్రో): ప్రజలకు ఎక్కువగా సేవలందించే రెవెన్యూ శాఖలో పనిచేయడం గర్వంగా ఉందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు ఉత్తమ సేవలందిస్తే ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. జేసీ పి.ధాత్రిరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు ప్రజలకు ఉత్తమ సేవలందించి రోల్ మోడల్గా నిలవాలన్నారు. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు, నిబంధనలపై అవగాహన పెంచుకుని పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన రంగోలి పోటీలు, రెవెన్యూ చట్టాల పుస్తక ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించారు. డీఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ అన్సారీ, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, సూపరింటెండెంట్లు చల్లన్న దొర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖలో ఉత్తమ సేవలందించి పదవీ విరమణ చేసిన జగన్మోహనరావు, బన్నీ, పోతురాజు, రాజశేఖర్, రాజశేఖర్ రాయుడు, చంద్రశేఖర్ తదితరులను దుశ్శాలువాతో కలెక్టర్ సన్మానించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కలెక్టర్, జేసీని రెవెన్యూ సిబ్బంది సత్కరించారు.
మున్సిపల్ కార్మికుల దీక్షలు
తణుకు అర్బన్: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) జిల్లా కార్యదర్శి గెల్లా విజయకుమార్ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం కార్మికులు నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదన్నారు.

5,616 వేదికల్లో యోగా