
మార్టేరు పరిశోధన స్థానంలో పదోన్నతులు
పెనుమంట్ర: మార్టేరు ప్రాంతీయ పరిశోధన స్థానంలో వివిధ విభాగాల్లో శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్న ఎనిమిది మంది శాస్త్రవేత్తలకు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పదోన్నతులు లభించాయి. ఈ సందర్భంగా పరిశోధన స్థానంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఆత్మీయ సమావేశంలో బంగారు పతకం అందుకున్న డాక్టర్ టి.శ్రీనివాస్ తో పాటు డాక్టర్ బి.సహదేవరెడ్డి ( పంటల యాజమాన్య విభాగం), డాక్టర్ ఎస్.దయాకర్, డాక్టర్ పి.రాధిక (కీటక శాస్త్ర విభాగం) సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందగా.. డాక్టర్ ఎం.గిరిజా రాణి, డాక్టర్ వై సునీత(మొక్కల ప్రజనన విభాగం) ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. డాక్టర్ పీవీ రమేష్ బాబు(పంటల యాజమాన్య విభాగం). డాక్టర్ వీ రోజా (మొక్కల ప్రజనన విభాగం) అసిస్టెంట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు.