ఇటీవల కాలంలో చిన్నారుల్లో నేత్ర, దంత వైద్య సమస్యలు అధికంగా నమోదవుతున్నాయి. చిన్నారుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించాలి. వారికి ఆరోగ్యకర ఆహారం అందించాలి. ఆరోగ్య సమస్యలు గుర్తించిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంప్రదించాలి.
– జి.హరిశ్చంద్రప్రసాద్, ఆర్బీఎస్కే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, తూర్పుగోదావరి
వచ్చే నెల నుంచి పరీక్షలు
అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరంలోనూ పరీక్షలు చేస్తాం. వచ్చే నెల నుంచి ప్రారంభిస్తాం. జిల్లా సత్వర చికిత్సా కేంద్రం ద్వారా శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా చేయిస్తాం.
– ఎన్.వసుంధర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, తూర్పుగోదావరి


