న్యూస్రీల్
ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2026
అధికారులు అనాలోచిత నిర్ణయంతో
పర్యాటకం దెబ్బతింటుంది
సమస్య ఏర్పడితే తక్షణమే చక్కదిద్ది పర్యాటకాన్ని కొనసాగించాలి. రోజుల తరబడి బోట్లను నిలిపివేయడం ఇబ్బందిగా మారింది. బోట్లు ఆకస్మికంగా నిలిపివేస్తే ఆసక్తి తగ్గిపోయి ఆ స్థానంలో భయం ఏర్పడే అవకాశం ఉంది. అధికారులు పునరాలోచించి పర్యాటకాన్ని పునరుద్ధరించాలి.
– టి.గాయత్రి, రాజమహేంద్రవరం
మంత్రి దృష్టి సారించాలి
జిల్లా కేంద్రంలో ఉండే సంబంధిత మంత్రి కందుల దుర్గేష్ పాపికొండల పర్యాటకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇష్టమొచ్చిన నిర్ణయాల వల్ల పాపికొండల పర్యాటకం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అధికారులు పర్యాటకంపై ప్రత్యేక దృష్టి సారించాలి.
– బి.శ్రీకాంత్ రెడ్డి, పర్యాటకుడు


