పెంచిన ఎరువుల ధరలను సత్వరమే తగ్గించాలి. ఇప్పటికే కనీస మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి ఎరువుల ధరల పెంపు భారంగా మారింది. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకునే చర్యలు తీసుకోవాలి.
–పెంటపాటి వెంకట్రావు, కౌలురైతు, మోదుకూరు
వరి సాగులో ఇబ్బందులు
వరి సాగులో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలి. ఎరువులు, పురుగు మందుల ధరలను తగ్గించాలి. అప్పుడే సాగు పండగలా మారుతోంది.
–ముదునూరి సుబ్బరాజు, రైతు, ఆత్రేయపురం
●


