గణేష్ నిమజ్జనంలో విషాదం.. చెరువులో పడి యువకుడి మృతి | A Young Man Died After fell Into A Pond In Yadadri District | Sakshi
Sakshi News home page

గణేష్ నిమజ్జనంలో విషాదం.. చెరువులో జారిపడి యువకుడి మృతి

Sep 17 2024 2:32 PM | Updated on Sep 17 2024 2:40 PM

A Young Man Died After fell Into A Pond In Yadadri District

సాక్షి, యాదాద్రి భువనగిరి: వినాయకుడి నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకరస సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు గణేషుడిని చెరువులో నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందాడు. ప్రవీణ్ మృతదేహం వెలికి తీసేందుకు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చదవండి: ఉత్సాహంగా వినాయక నిమజ్జనం

Advertisement
 
Advertisement
Advertisement