విశాఖలో దారుణం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య | Woman Software Employee Commits Suicide In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో దారుణం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

Jan 30 2023 7:11 PM | Updated on Jan 31 2023 5:59 AM

Woman Software Employee Commits Suicide In Visakhapatnam - Sakshi

సౌజన్య(ఫైల్‌)

సింహాచలం(విశాఖపట్నం): సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెందుర్తి మండలం దువ్వుపాలెంలో చోటుచేసుకుంది. పెందుర్తి సీఐ అప్పారావు తెలిపిన వివరాలివీ.. హైదరాబాద్‌కు చెందిన సౌజన్య(26)కి, శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన హనుమంతు గిరిప్రసాద్‌తో 8 నెలల కిందట వివాహం జరిగింది. మూడు నెలల కిందట వీరు దువ్వుపాలెంలో ఇళ్లు కొనుగోలు చేసి నివసిస్తున్నారు.

గిరిప్రసాద్‌  నగరంలోని ఓ ఆస్పత్రిలో దంత వైద్యుడిగా పనిచేస్తున్నాడు. సౌజన్య అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. వర్క్‌ ఫ్రమ్‌ హోం ద్వారా విధులు నిర్వర్తిస్తోంది. వీరి వివాహం సమయంలో సౌజన్య తండ్రి విష్ణు.. గిరిప్రసాద్‌కు 6లక్షల నగదు, 13 తులా ల బంగారం ఇచ్చారు.
చదవండి: నెత్తుటి మరక.. అతనొక మానసిక రోగి

అయినా తరచూ డబ్బులు తీసుకురావాలని సౌజన్యతో గిరిప్రసాద్‌ గొడవపడేవాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. శనివారం సాయంత్రం గిరిప్రసాద్‌ విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసే సరికి సౌజన్య ఉరివేసుకుని ఉంది. ఈ విషయాన్ని సౌజన్య తల్లిదండ్రులకు తెలిపాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్నం వేధింపుల కింద కేసు నమోదు చేసి సీఐ అప్పారావు, ఎస్‌ఐ సురేష్‌ దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement