RMP Doctor commits suicide after killing wife in Hyderabad - Sakshi
Sakshi News home page

ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఉన్మాదం.. నిద్రపోతున్న భార్యను దారుణంగా హత్య చేసి.. ఆపై

May 21 2023 9:41 AM | Updated on May 21 2023 10:37 AM

RMP Doctor Killed Wife And Commit Suicide - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అతని వృత్తి ప్రాణాలను పోసే ఆర్‌ఎంపీ డాక్టర్‌. కానీ అందుకు భిన్నంగా భార్యను కత్తితో మెడ కోసి ప్రాణం తీసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్సింగి ఏసీపీ జీవీ రమణగౌడ్‌ కథనం ప్రకారం.. శంకర్‌పల్లి మండలం జన్వాడలోని ఓ ఇంట్లో ఆర్‌ఎంపీ డాక్టర్‌ నాగరాజు తన భార్య సుధారాణి, ఇద్దరు కుమారులతో కలిసి ఉంటూ అనుబంధ గ్రామమైన మియాఖాన్‌గూడలో క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత నిద్రపోతున్న భార్యను కొబ్బరికాయలు కొట్టే కత్తితో మెడ కోసి హత్య చేశాడు. అనంతరం ఏడేళ్ల పెద్ద కుమారుడు దీక్షిత్‌ మొహంపైనా దిండు పెట్టి బలంగా ఒత్తాడు. అంతలోనే అతన్ని వదలి కిచెన్‌లోకి వెళ్లి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తేరుకున్న దీక్షిత్‌ తన తమ్మున్ని తీసుకుని పక్క గదిలోకి వచ్చి రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే గడిపారు.

శనివారం ఉదయం పక్కింట్లోని మహిళ వాకిలి ఊడుస్తుండటంతో అలికిడి చప్పుడు విని ఆమెను పిలిచి విషయం చెప్పారు. వెంటనే స్థానికులు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, భార్యాభర్తలిద్దరూ గొడవ పడిన దాఖలాలు కూడా లేవని, హత్యకు, ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని ఏసీపీ చెప్పారు.

చదవండి: విశాఖలో షాకింగ్‌ ఘటన.. ప్రియురాలు వేరొకరిని ఇష్టపడుతుందని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement