రూ.120 బిల్లు కోసం.. మామ హత్య | A Man Was Assassinated Due To Ask Nephew To Pay Rs 120 In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

రూ.120 బిల్లు కోసం.. మామ హత్య

Jul 6 2021 8:20 PM | Updated on Jul 6 2021 8:30 PM

A Man Was Assassinated Due To Ask Nephew To Pay Rs 120 In Madhya Pradesh - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి రూ.120 చెల్లించమన్నందుకు తన మేనమామను హత్య చేశాడు. ఈ ఘటన గ్యాలియర్‌లోని ఓల్డ్ కాంట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కయూమ్ ఖాన్ చేపలను విక్రయించేవాడు. అతని మేనల్లుడు సమీపంలో చేపల వేపుడును అమ్మేవాడు.అయితే ఆదివారం రాత్రి కల్లు ఖాన్ అతని మేనమామ దగ్గర రూ.120కి చేపలను కొని, బిల్లు చెల్లించలేదు.

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతే కల్లు అనే వ్యక్తి కయూమ్ ఖాన్‌పై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన కయూమ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఇక మృతుడి కుటుంబం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement