టీవీ ఆఫ్‌ చేయనన్నాడని తండ్రిని.. 

Ex Army Man Assassinated Dad For Not Switch Offing TV - Sakshi

లక్నో : టీవీ ఆఫ్‌ చేయమంటే ఆఫ్‌ చేయలేదన్న కోపంతో తండ్రిని కాల్చి చంపాడో మాజీ ఆర్మీ ఉద్యోగి. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  మాజీ ఆర్మీ ఉద్యోగి అశోక్‌ కథిహార్‌ కుటుంబంతో కలిసి నసీర్‌పుర్‌లో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి అతడి తండ్రి లాలా రామ్‌ టీవీ చూస్తున్నాడు. అర్థరాత్రి దాటినా టీవీ చూస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో టీవీ ఆఫ్‌ చేయాల్సిందిగా అశోక్‌ తండ్రిని అడిగాడు. తండ్రి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. ( గుప్త నిధుల కోసం తండ్రి ఘాతుకం )

తీవ్ర ఆగ్రహానికి గురైన అశోక్‌ లైసెన్స్‌ కలిగిన డబుల్‌ బ్యారెల్‌ గన్‌తో తండ్రిని కాల్చి చంపాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అశోక్‌ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా, అశోక్‌ బాగా తాగేవాడని, చీటికీ మాటికి ఇంట్లో వారితో గొడవ పడే వాడని కుటుంబసభ్యులు తెలిపారు. ( నంద్యాల కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌ )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top