చిలకలూరిపేట ఐసీఐసీఐలో సీఐడీ విచారణ | CID investigation in ICICI at Chilakaluripet | Sakshi
Sakshi News home page

చిలకలూరిపేట ఐసీఐసీఐలో సీఐడీ విచారణ

Oct 11 2024 4:18 AM | Updated on Oct 11 2024 12:56 PM

CID investigation in ICICI at Chilakaluripet

ఇప్పటి వరకు 72 మంది బాధితుల గుర్తింపు

రూ. 28 కోట్లు గోల్‌మాల్‌ జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి

చిలకలూరిపేట: ఐసీఐసీఐ బ్యాంకు చిలకలూరిపేట బ్రాంచ్‌లో జరిగిన కుంభకోణం విషయంలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ ఏఎస్పీ సీహెచ్‌ ఆదినారాయణ ఆధ్వర్యంలో సీఐడీ అధికారుల బృందం గురువారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్‌కి చేరుకుని విస్తృతంగా విచారణ చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకు తలుపులు మూసివేసి ఎవరినీ లోనికి అనుమతించకుండా విచారణ కొనసాగించారు. 

ఈ సందర్బంగా సీఐడీ ఏఎస్పీ సీహెచ్‌ ఆదినారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8న సీఐడీ  ప్రధాన కార్యాలయంలో సంబంధిత విషయమై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం కేసు­ను గుంటూరు సీఐడీ కార్యా­ల­యానికి బదిలీ చేసినట్టు తెలి­పా­రు. తమ విచారణలో ఇప్ప­టి వరకు 72 మంది ఖాతాదారులకు సంబంధించి రూ. 28 కోట్లు గోల్‌­మాల్‌ జరిగినట్టు గుర్తించినట్లు తెలిపారు. 2021 నుంచి ఇక్కడ బ్రాంచి మేనేజర్‌గా పనిచేసిన దూడ నరేష్‌చంద్రశేఖర్, మరో ఇద్దరు కలిసి ఈ కుంభకో­ణానికి పాల్పడినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. 

ఇక్కడ పనిచేసిన అనంతరం నరేష్‌చంద్ర­శేఖర్‌ నరసరావుపేట, విజయవాడ భారతీనగర్‌ బ్రాంచ్‌­లలో మేనేజర్‌గా పనిచేసినట్టు తెలిపారు. విజయ­వాడలో పనిచేస్తున్న సమయంలో అతని అవకతవకలు వెలుగు చూసి ఈ ఏడాది జూలైలో బ్యాంకు అతనిని విధుల నుంచి సస్పెండ్‌ చేసింద­న్నారు. ఈ నెల చిలకలూరిపేట బ్రాంచిలో జరిగిన అక్రమాలు వెలుగు చూడటంతో సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు.  

ఇంకా ఎవరైనా బ్యాంకు సిబ్బంది ఈ వ్యవ­హారంలో ఉన్నారా లేరా అనేది విచారణలో తేలాల్సి ఉందని తెలిపారు. వారం, పది రోజుల్లో విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, కేసు విషయమై ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకో­లేద­న్నారు.  సీఐడీ సీఐ సంజీవ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

	ఐసీఐసీఐ బ్యాంకులో భారీ స్కామ్.. సీఐడీ విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement