అస్సాంలో ఉగ్ర కలకలం | Assam Police Arrest 12 People With Alleged Links to Bangladeshi Terror Group | Sakshi
Sakshi News home page

అస్సాంలో ఉగ్ర కలకలం

Jul 29 2022 5:54 AM | Updated on Jul 29 2022 5:54 AM

Assam Police Arrest 12 People With Alleged Links to Bangladeshi Terror Group - Sakshi

గువాహటి: బంగ్లాదేశ్‌ కేంద్రంగా పనిచేసే అన్సరుల్‌ ఇస్లామ్‌ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన 12 మంది జిహాదీలను అస్సాం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరితో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న మరో ఏడుగురిని కూడా గురువారం అదుపులోకి తీసుకున్నారు.

ఇతర రాష్ట్రాల సహకారంతో చేపట్టిన ఈ ఆపరేషన్‌తో రెండు ప్రధాన ఉగ్ర మాడ్యూల్‌లను పట్టుకున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ప్రధానంగా బార్పేట, మోరిగావ్‌ జిల్లాల్లో చేపట్టిన దాడుల్లో చిక్కిన వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం(ఉపా)కింద కేసులు నమోదు చేశామన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement