జిల్లాలో మామిడి రైతులు గత నెల రోజులుగా రోడ్లపై అల్లాడిపోతున్నారు. టోకన్లు, వరుస నంబర్లతో విసిగిపోతున్నారు. ఫ్యాక్టరీ వద్దే కునుకు తీస్తూ పంటను అమ్ముకోవడానికి నానాతిప్పలు పడుతున్నారు. కూటమి నేతల సిఫార్సులతో సామాన్య రైతు కాయలు కుళ్లి పోతున్నాయి. రైతులు గుండె నిండా కన్నీళ్లు దాచుకుని...తమ గోడును బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. అయితే కూటమినేతలు, ప్రజాప్రతినిధులు మాత్రం మామిడి రైతుల కష్టాలపై నోరెత్తకపోగా.. రూ.4కే పాలాభిషేకాలు చేయడం విడ్డూరంగా ఉంది. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే మేము మళ్లీ ఉద్యమం చేపడుతాం. – కృపాలక్ష్మి,
జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త


