పుత్తూరు: మండల పరిధిలోని కేబీఆర్పురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని సోమ వారం గ్రామస్తులు గుర్తించారు. గ్రామంలోని బీసీ కాలనీ వినాయకస్వామి ఆలయ సమీపంలో మృతదేహం ఉన్నట్లు వీఆర్ఓకు సమాచారం అందజేశారు. మృతుడి వయస్సు 55 ఏళ్లు ఉంటుందని, నల్లప్యాంటు, ఆకు పచ్చ చొక్కా ధరించి ఉన్నాడని తెలిపారు. గ్రామ వీఆర్ఓ దామోదరం ఫిర్యాదు మేరకు పుత్తూ రు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.


