సహకార పోరు..! | - | Sakshi
Sakshi News home page

సహకార పోరు..!

Feb 23 2026 7:32 AM | Updated on Feb 23 2026 7:32 AM

సహకార పోరు..!

సహకార పోరు..!

● జిల్లాలో సహకార సంఘాల ఉద్యోగుల సమ్మె పోరు ● డిసెంబర్‌ 6 నుంచి దశలవారీగా నిరసనలు, ధర్నాలు ● ఈ నెల 13 నుంచి నిరవధిక సమ్మెలోకి ● విధుల బహిష్కరణ ● నేడు డీసీసీబీ కార్యాలయం ఎదుట నిరసన ● జీవో నంబర్‌ 36ను వెంటనే అమలుచేయాలి. ● 2019 నుంచి 2024 పెండింగులో ఉన్న వేతన సవరణలు చేయాలి. అప్పటి వరకు మధ్యంతర భృతి ఇవ్వాలి. ● చట్ట ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలి. ● ఉద్యోగుల ఉద్యోగ విమరణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలి. ● ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమాను కల్పించాలి. ఉద్యోగి సర్వీస్‌లో మరణిస్తే రూ.20 లక్షల టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి. ● 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్‌ చేయాలి. అలాగే హెర్‌ఆర్‌ పాలసీని అమలుచేయాలి. ● ఉద్యోగుల జీతాభత్యాలను డ్యూటీ పద్దులను రద్దు చేయాలి. ● సహకార సంఘాల చెల్లించిన షేరు ధనంపై డివిడెండ్‌ కనీసం 6 శాతం చెల్లించాలి. అనేక ఏళ్ల నుంచి పెండింగులో ఉన్న డివిడెండ్‌ను వెంటనే చెల్లించాలి. ● డీఎల్‌ఎస్‌ఎఫ్‌ను ఆప్కాబ్‌,డీసీసీబీలు పీఎసీఎస్‌లతో ఏర్పాటు చేసి 3 ఏళ్ల నిబంధన కాకుండా నిరవధికంగా కొనసాగించి బదిలీలు చేయాలి. ● నిబంధనలకు సంబంధం లేకుండా ఉద్యోగుల జీత భత్యాలను డీఎల్‌ఎస్‌ఎఫ్‌ ద్వారా నిరవధికంగా చెల్లించాలి. ● ప్రస్తుతం పనిచేస్తున్న ఏఈ, క్లర్క్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లను సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్‌ ఇచ్చి జిల్లాలో ఖాళీగా ఉన్న సీఈవో పోస్టుల్లో నియమించాలి.

ఇవీ వారి డిమాండ్లు

సహకార ఉద్యోగుల సమ్మె ఉద్ధృతమవుతోంది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన పోరుబాట తారస్థాయి కి చేరుతోంది. ఇన్నాళ్లు దశలవారీగా నిరసనలు, ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఉద్యోగులు పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. సోమవారం నుంచి విధులను బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి దిగుతున్నారు. డీసీసీబీ ఎదుట నిరసనలకు శ్రీకారం చుట్టనున్నారు. డిమాండ్లు సాధించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తున్నారు.

సొసైటీ కార్యాలయం ఎదుట ధర్నా

చేస్తున్న ఉద్యోగులు (ఫైల్‌)

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా డీసీసీబీ పరిధిలో 75 వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 350 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారు పడుతున్న ఇబ్బందులను ఏళ్లతరబడి ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళుతూనే ఉన్నారు. ఫలితం లేకపోవడంతో డిసెంబర్‌ 16వ తేదీ నుంచి దశలవారీగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపట్టారు. చిత్తూరు సొసైటీ సంఘం కార్యాలయం, డీసీసీబీ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. విజయవాడలో కూడా గళం విప్పా రు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె బాటపట్టారు. ఇందులో భాగంగా సంఘం కార్యాలయల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సహకార సంఘాల్లో ఉద్యోగులు లేకపోవడంతో రైతులు, ఇతరులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ రుణాలు ఎక్కువ శాతం సహకార సంఘాలే మంజూరు చేస్తుంటాయి. ప్రస్తు తం రైతులు రబీ పంటల సాగుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పెట్టుబడి కోసం రుణాలు తీసుకోవడానికి సహకార సంఘాలకు వెళుతున్నారు. అక్కడ ఉద్యోగులు లేక రుణాల మంజూరు ప్రక్రియ నిలిచిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు.

డీసీసీబీ ఎదుట సమ్మెకు శ్రీకారం

జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘాల ఉద్యోగులు సోమవారం చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లిలోని డీసీసీబీ కార్యాలయం ఎదుట ధర్నాకు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం నుంచే సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు పోలీసు శాఖ అనుమతి కోరారు. 300 మందికి పైగా సమ్మెలో పాల్గొనున్నట్టు సంఘం నేతలు వెల్లడించారు. డిమాండ్ల సాధనే లక్ష్యమని తెలియజేశారు. ఇందుకు సహకార ఉన్నతాధికారులు, పోలీసు శాఖ సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement