
బోయకొండలో రాహుకాల పూజలు
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా గంగమ్మకు రాహుకాల పూజలు నిర్వహించారు. రాహుకాల సమయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు సంప్రదాయంగా అర్చనలు , అభిషేక పూజలు చేశారు. శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, పూలతో ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస దీక్షలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చారు. ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఉచిత అన్నప్రసాదం పంపిణీ చేశారు.