ఎల్‌ఐసీ ఎండీగా తబ్లేష్‌ పాండేకు పదోన్నతి 

Tablesh Pandey appointed as LIC MD - Sakshi

న్యూఢిల్లీ: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) తబ్లేష్‌ పాండే మేనేజింగ్‌ డైరెక్టర్‌గా (ఎండీ) పదోన్నతి పొందారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఎండీ బీసీ పట్నాయక్‌ స్థానంలో పాండే నియమకం జరిగింది. ఎల్‌ఐసీలో ప్రస్తుతం నలుగురు ఎండీలు ఉన్నారు. 

ఇదీ చదవండి:రిలయన్స్‌ ‘మెట్రో’ డీల్‌ ఓకే, రూ.2,850 కోట్లతో కొనుగోలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top