పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు | stock market updates on june 13 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Jun 13 2025 9:42 AM | Updated on Jun 13 2025 9:42 AM

stock market updates on june 13 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు లాభపడి 25,186కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 132 ప్లాయింట్లు పెరిగి 82,639 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.21 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 75.91 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.38 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.24 శాతం పుంజుకుంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో భారత స్టాక్‌ సూచీలు నిన్నటి సెషన్‌లో ఒకశాతం నష్టపోయాయి. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ దాడికి సన్నాహాలు చేస్తోందన్న వార్తలతో క్రూడాయిల్‌ ధరలు పెరుగుదల, అధిక వాల్యుయేషన్ల ఆందోళనలు, వారాంతపు ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు అంశాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సూచీల ఒక శాతం పతనంతో రూ.5.98 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్‌ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.449 లక్షల కోట్లు (5.26 ట్రిలియన్‌ డాలర్లు)కు దిగివచ్చింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement