
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు లాభపడి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 132 ప్లాయింట్లు పెరిగి 82,639 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.36 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 69.45 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.27 శాతం లాభపడింది. నాస్డాక్ 0.5 శాతం పుంజుకుంది.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక మే నెలలో గణనీయంగా తగ్గింది. 13 నెలల కనిష్ట స్థాయిలో రూ.19,013 కోట్లకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాల్లో పెట్టుబడుల రాక తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈక్విటీల్లోకి వచ్చిన రూ.24,269 కోట్ల పెట్టుబడలతో పోల్చి చూస్తే మే నెలలో పెట్టుబడుల రాక 22 శాతం క్షీణించింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)