
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:17 సమయానికి నిఫ్టీ(Nifty) 21 పాయింట్లు నష్టపోయి 24,727కు చేరింది. సెన్సెక్స్(Sensex) 158 ప్లాయింట్లు దిగజారి 81,293 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.8 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.13 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.38 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.53 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.83 శాతం దిగజారింది.
ఈ రోజు ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత నిర్ణయాన్ని ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. ఆర్బీఐ ఈసారి కూడా వడ్డీరేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో నిన్న మార్కెట్లు పుంజుకున్నాయి. అంచనాలకు తగినట్లుగానే ఈసారి రెపో రేటులో ఆర్బీఐ కోత విధిస్తే ఇది వరుసగా మూడోసారి అవుతుంది. ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీరేట్లును తగ్గించారు. తర్వాత ఏప్రిల్లోనూ కుదించారు. డిసెంబర్లో సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా వడ్డీరేట్లును తగ్గిస్తున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)