యూఎస్‌తో వాణిజ్య ఒప్పందంపై ఫోకస్‌ | Stock Market Updates On July 7th 2025, Sensex Lost 126 Points And Is Trading At 83,313 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Jul 7 2025 9:22 AM | Updated on Jul 7 2025 9:58 AM

stock market updates on july 07 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:20 సమయానికి నిఫ్టీ(Nifty) 38 పాయింట్లు తగ్గి 25,423కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 126 ప్లాయింట్లు  నష్టపోయి 83,313 వద్ద ట్రేడవుతోంది.

మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే పలు కీలక సంఘటనలు ఈ వారంలో చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్‌ టారిఫ్‌ వార్‌పై కీలక ప్రకటన వెలువడనుంది. అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలకు 90 రోజుల సస్పెన్షన్‌ గడువు జూలై 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం కుదర్చుకోగా.. భారత్‌ కూడా వాణిజ్య చర్చల్లో తలమునకలైంది. ఈ సంప్రదింపులు విజయవంతమై, డీల్‌ గనుక కుదిరితే మార్కెట్‌ సెంటిమెంట్‌ మరింత పుంజుకుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement