Reliance Jio Gains 6,49,000 Mobile Users In August - Sakshi
Sakshi News home page

జియోకు కొత్తగా 6.49 లక్షల మంది కస్టమర్లు

Oct 21 2021 4:42 AM | Updated on Oct 21 2021 10:11 AM

Reliance Jio gains 649,000 mobile users in August - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెలికం సంస్థ రిలయన్స్‌ జియో ఆగస్ట్‌ నెలలో కొత్తగా 6.49 లక్షల మంది వైర్‌లెస్‌ వినియోగదార్లను సొంతం చేసుకుంది. సంస్థ మొత్తం కస్టమర్ల సంఖ్య 44.38 కోట్లకు చేరుకుంది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) గణాంకాల ప్రకారం.. భారతి ఎయిర్‌టెల్‌ 1.38 లక్షల మంది వినియోగదార్లను దక్కించుకుంది. దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 35.41 కోట్లుగా ఉంది. వొడాఫోన్‌ ఐడియా 8.33 లక్షల మందిని చేజార్చుకుంది. మొత్తం వినియోగదార్ల సంఖ్య 27.1 కోట్లకు వచ్చి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement