జియోకు జై, వొడాఫోన్‌ ఐడియాకు బై..బై!

Reliance Jio adds 31 lakh new mobile users in May TRAI data - Sakshi

సబ్‌స్క్రైబర్ల విషయంలో టాప్‌లో జియో

వొడాఫోన్‌ ఐడియాకు దాదాపు 8 లక్షలమంది గుడ్‌ బై

సాక్షి, ముంబై: టెలికం మేజర్‌ రిలయన్స్‌ జియో మరోసారి  దుమ్ము  రేపింది. కొత్త కస్టమర్లను సాధించడంలో జియో తన ఆధిక్యాన్ని నిరూపించుకుని టాప్‌లో నిలిచింది. మే నెలలో 31 లక్షలమంది మొబైల్‌ వినియోగదారులను తన ఖాతాలో జమ చేసుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నెలవారీ సబ్‌స్క్రైబర్ డేటా  నేడు (జూలై19) విడుదల చేసింది.

రెగ్యులేటరీ ట్రాయ్‌ మంగళవారం విడుదల చేసిన డేటా ప్రకారం, మేలో 31 లక్షల మంది వైర్‌లెస్  మొబైల్ వినియోగదారులను సొంతం చేసుకుంది రిలయన్స్‌ జియో.  ఫలితంగా  జియో  మొబైల్ కస్టమర్ల సంఖ్య 40.87 కోట్లకు చేరుకుంది.  అలాగే సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్‌టెల్ మే నెలలో 10.27 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సాధించింది. దీంతో  ఎయిర్‌టెల్‌  మొబైల్ వినియోగదారుల సంఖ్య 36.21 కోట్లకు చేరుకుంది. వొడాఫోన్‌ ఐడియా  7.59 లక్షల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. దీంతో సబ్‌స్క్రైబర్ బేస్ 25.84 కోట్లకు పడిపోయింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top