
వాషింగ్టన్: భారత్ వృద్ధి వేగం అంచనాలకన్నా తక్కువగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. పారిశ్రామిక క్రియాశీలత మందగమనలో ఉందని తన తాజా వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్లో పేర్కొంది. 2026 వరకూ దేశం 6.5 శాతం వృద్ధి రేటును కొనసాగిస్తుందని తెలిపింది.
ఇక 2025, 2026లో ప్రపంచ వృద్ధి రేటు 3.3 శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2000–2019 మధ్య సగటు 3.7 శాతంకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. ప్రపంచ ద్రవ్యోల్బణం 2025లో 4.2 శాతం, 2026లో 3.5 శాతం ఉంటుందని సంస్థ అంచనా వేసింది.