హెచ్‌డీఐఎల్‌ ప్రమోటర్లపై మరో సీబీఐ కేసు | Cbi Fir Against Hdil Promoters In New Bank Fraud Case | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఐఎల్‌ ప్రమోటర్లపై మరో సీబీఐ కేసు

Jan 6 2023 10:44 AM | Updated on Jan 6 2023 10:44 AM

Cbi Fir Against Hdil Promoters In New Bank Fraud Case - Sakshi

న్యూఢిల్లీ: హెచ్‌డీఐఎల్‌ ప్రమోటర్లు రాకేష్‌ వాధ్వాన్, సారంగ్‌ వాధ్వాన్‌లపై మరో బ్యాంక్‌ మోసం కేసును సీబీఐ నమోదుచేసింది. వారి అనుబంధ సంస్థ గురుఆశిష్‌ కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన రూ.140 కోట్ల మోసం విషయంలో కొత్త కేసును నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.  

పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంకుకు సంబంధించి రూ.4,300 కోట్ల  కుంభకోణం కేసులో ఇప్పటికే ఇరుక్కున్న ఈ  వ్యాపారవేత్తలపై తాజాగా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) నుండి వచ్చిన ఫిర్యాదుపై తాజా చర్య ప్రా రంభించినట్లు వారు తెలిపారు. 

యస్‌ బ్యాంక్‌కు సంబంధించి రూ.200 కోట్ల కుంభకోణంలో కూడా వాధ్వాన్‌లపై కేసు దాఖలైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement