బోట్‌లో రూ. 731 కోట్ల వార్‌బర్గ్‌ పింకస్‌ పెట్టుబడులు | boAt raises 100 million dollers from Warburg Pincus | Sakshi
Sakshi News home page

బోట్‌లో రూ. 731 కోట్ల వార్‌బర్గ్‌ పింకస్‌ పెట్టుబడులు

Jan 7 2021 4:15 AM | Updated on Jan 7 2021 4:15 AM

boAt raises 100 million dollers from Warburg Pincus - Sakshi

న్యూఢిల్లీ: హెడ్‌ఫోన్స్, ఇయర్‌ ఫోన్స్, స్మార్ట్‌ వాచెస్‌ వంటి కన్సూమర్‌ టెక్‌ ఉత్పత్తుల బ్రాండ్‌... బోట్‌లో అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, వార్‌బర్గ్‌ పింకస్‌ 10 కోట్ల డాలర్లు (రూ.732 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. వార్‌బర్గ్‌ పింకస్‌కు చెందిన అనుబంధ సంస్థ ఈ మేరకు తమ సంస్థలో ఇన్వెస్ట్‌ చేసిందని బోట్‌ వెల్లడించింది. ఈ లావాదేవీకి ఆర్థిక సలహాదారుగా అవెండాస్‌ క్యాపిటల్‌ వ్యహరించిందని పేర్కొంది. పరిశోధన, అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డీ) విభాగాన్ని మరింత శక్తివంతం  చేసుకోవడానికి, అగ్రస్థానంలో ఉన్న తమ మార్కెట్‌ను మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ తాజా నిధులను వినియోగిస్తామని వివరించింది. భారత్‌లో తయారీ కార్యక్రమం కింద వివిధ ఉత్పత్తుల తయారీకి దన్నుగా ఉండే వ్యవస్థల కోసం కూడా ఈ నిధులను ఉపయోగిస్తామని వివరించింది.  ఐడీసీ(ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌) గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అతి పెద్ద ఐదవ వేరియబుల్‌ (ధరించే ఉత్పత్తుల) బ్రాండ్‌ తమదేనని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement