మహిళా సర్పంచ్ అర్ధరాత్రి పట్టుకున్నా..
ఈ నెల 16న అర్ధరాత్రి సమయంలో వాగు నుంచి జేసీబీ యంత్రంతో ఇసుక తోడి లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండగా నాగారం గ్రామ పంచాయతీ మహిళా సర్పంచ్ స్వప్న, మరో ముగ్గురు వార్డు సభ్యులు, స్థానిక యువకులతో కలిసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్రమార్కులు దాడికి యత్నించడమే కాకుండా అసభ్యపదజాలంతో దూషించారని సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా సర్పంచ్ అర్ధరాత్రి వెళ్లి అడ్డుకుని, అధికారులకు సమాచారం ఇచ్చినా రెవెన్యూ, పోలీస్ శాఖలు పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదు రోజులు గడిచినా యంత్రాన్ని సీజ్ చేయకపోవడం, కేసు నమోదు చేయకపోవడంలో ఆంతర్యమేమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.


