రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
పెనుబల్లి: తోటి ఉద్యోగి దశదిన కర్మకు వెళ్లి వస్తున్న ఆర్టీసీ డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన ఇది. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లికి చెందిన బర్రె వంశీ సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన సహచరుడైన డ్రైవర్, పెనుబల్లికి చెందిన రాయల జయప్రకాష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని దశదిన కర్మకు హాజరైన వంశీ ఎర్రగుంట్లలోని తన అత్తవారింటికి బైక్పై వెళ్తుండగా పెనుబల్లి మండలంలోని కొత్తగూడెం వైపు వెళ్లే జాతీయ రహదారిపై నాగమల్లేశ్వర ఆలయం వద్ద వాహనం అదుపుతప్పి డ్రెయినేజీని ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో 108 సిబ్బంది చేరుకుని వంశీకి సీపీఆర్ చేస్తూ పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య, ఏడాది వయస్సు గల కుమార్తె ఉన్నారు.
బోనకల్: మండలంలోని లక్ష్మీపురానికి చెందిన వివాహిత గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కిలారు లక్ష్మి (48) రెండేళ్లుగా మానసికస్థితి సరిగా లేకపోవడంతో చికిత్స చేయిస్తున్నారు. ఆమె భర్త రమేశ్ గురువారం మండల కేంద్రానికి వెళ్లి మధ్యాహ్నం వచ్చేసరికి ఆమె కింద పడి ఉండగా విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు గుర్తించాడు. ఘటనపై వీరి కుమారుడు ఆకాష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.వెంకన్న తెలిపారు. కాగా, లక్ష్మి మృతదేహం వద్ద సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్రావు, నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు, కల్యాణం వెంకటేశ్వరరావు తదితరులు నివాళులర్పించారు.
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి


