
అందరికీ న్యాయం దక్కాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్
కొత్తగూడెంటౌన్: అందరికీ న్యాయం జరిగేలా న్యాయవ్యవస్థ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంతత్ అన్నారు. గురువారం కొత్తగూడెం జిల్లా కోర్టులోని లైబ్రరీ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కొత్తగూడెం జిల్లా మొదటి అదనపు జడ్జి ఎస్. సరిత, కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కిరణ్కుమార్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా రాజేందర్
కొత్తగూడెంటౌన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా ఎం.రాజేందర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

అందరికీ న్యాయం దక్కాలి