మదనపల్లె సిటీ : నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మదనపల్లెకు చెందిన కె. జయంత్రెడ్డి ప్రతిభ కనబరిచాడు. శనివారం విడుదల చేసిన ఫలితాల్లో మదనపల్లె పట్టణం రెడ్డీస్ కాలనీకి చెందిన మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్రెడ్డి ,శ్రావణిల కుమారుడు జయంత్రెడ్డి 4571 ఆలిండియా ర్యాంకు సాధించాడు. ఏపీ ఎంసెట్లో రాష్ట్ర స్థాయిలో 48 ర్యాంకు దక్కించుకున్నాడు. ఇంటర్మీడియట్ విజయవాడ చైతన్య కాలేజీలో చదివాడు. ఇంటర్మీడియట్లో 978 మార్కులు సాఽధించాడు. జయంత్రెడ్డిని పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కలకడ : కలకడ మండలం కె.బాటవారిపల్లె వద్ద శనివారం రాత్రి చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ రామాంజనేయులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం శెట్టిపల్లె జంగంపల్లెకు చెందిన శ్రీనివాసులు(49) తన ద్విచక్రవాహనంలో స్వగ్రామం నుంచి కలికిరి వైపు వెళ్తూ.. ముందుగా ఉన్న లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికి అక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీనివాసులుకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
ప్రకాష్నగర్లో చోరీ
కడప అర్బన్ : కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలో ప్రకాష్నగర్లో నివాసం వుంటున్న భవనాసి శ్రీనివాసులు (ఎల్ఐసీ, ఏఏఓ), ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అతని భార్య మేరీ స్టెల్లా శుక్రవారం రాత్రి తమ ఇంటికి లోపలివైపు నుంచి తాళాలు వేసుకుని బెడ్రూంలో నిద్రిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఇంటి వెనుకవైపున కటాంజనం (ఇనుపవాకిలి)కి వేసిన తాళం పగులగొట్టాడు. ఎంచక్కా ఇంటిలోకి ప్రవేశించి బీరువాను తెరిచి అందులోని బంగారు ఆభరణాలను దాదాపు ఏడు తులాలు, రూ.లక్షకు పైగా నగదును దోచుకుపోయాడు. ప్రకా ష్నగర్లోనే సంచరించిన సదరు దొంగ మూడు ఇళ్లలో కాలింగ్బెల్ నొక్కి దొంగతనాలకు ప్రయత్నించాడు. వీరి ఇంటిలో దొంగతనం చేశాడు. సీసీపుటేజీల ఆధారంగా దొంగకోసం గాలింపు చర్యలను చేపట్టారు. సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, చిన్నచౌక్ ఎస్ఐ ఎన్. రాజరాజేశ్వర్రెడ్డి, క్లూస్ టీంతోపాటు సిబ్బంది పరిశీలించారు.
నీట్ ఫలితాల్లో ప్రతిభ