
బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : బైక్ అదుపుతప్పి వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన కురుబలకోట మండలంలో జరిగింది. బెంగళూరుకు చెందిన ఇస్రాయిల్(45) కడప వద్ద బంధువుల గ్రామంలో జరుగుతున్న జాతరకు వచ్చాడు. తిరిగి ద్విచక్ర వాహనంలో బెంగళూరు వెళుతుండగా మార్గమధ్యంలోని కురబలకోట మండలం కుక్కరాజుపల్లి వద్ద వాహనం అదుపుతప్పి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో కాలు విరగ్గా గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు రెఫర్ చేశారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.