
● గిట్టుబాటు ధరలున్నా నష్టపోతున్న రైతులు
ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు రోజురోజుకు పుంజుకొంటున్నాయి. ఒక క్రీట్(25కేజీల) ధర రూ.400 నుంచి రూ.500 వరకు పలుకుతున్నాయి. అయితే ఊజి రోగం ప్రభావంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఒక ఎకరానికి 240 నుంచి 280 క్రిట్ల వరకు నల్లమచ్చలున్న కాయలు వస్తున్నాయి. దీంతో ఎకరానికి రూ.1.40 లక్షల చొప్పున రైతులు నష్టపోతున్నారు. జిల్లా మొత్తం మీద రూ.16 కోట్లు నష్టపోతున్నారు. చాలా రోజుల తరువాత మార్కెట్లో టమాటాలకు గిట్టుబాటు ధరలు పలుకుతున్నాయి. అయితే టమాటా రైతులను దురదృష్టం నల్లమచ్చలు, ఊజిరోగం రూపంలో మరోసారి వెంటాడింది. దీంతో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు.