20న జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

20న జాబ్‌మేళా

Jun 18 2025 3:51 AM | Updated on Jun 18 2025 3:51 AM

20న జ

20న జాబ్‌మేళా

రాజంపేట టౌన్‌: రాజంపేట పట్టణం రెడ్డివారివీధిలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 20న జాబ్‌మేళాల నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ జిల్లా కన్వీనర్‌ రామ్మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి జాబ్‌మేళా ప్రారంభం అవుతుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐలలో ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రాయనున్న విద్యార్థులతోపాటు 2023–2024 విద్యా సంవత్సరంలో ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా పాల్గొనవచ్చన్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారని తెలిపారు. అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిపికెట్లు, ఆధార్‌కార్డు ఒరిజినల్‌, జిరాక్స్‌ కాపీలను తమ వెంట తీసుకురావాలని వివరించారు.

19న హార్సిలీహిల్స్‌లో యోగాంధ్ర

రాయచోటి: హార్సిలీహిల్స్‌లో ఈనెల 19న యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్‌ హార్సిలీహిల్స్‌లో వెయ్యి మందితో నిర్వహించబోయే యోగాంధ్ర కార్యక్రమంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పర్యాటక కేంద్రాల్లో నిర్వహిస్తున్న సందర్భంగా ఈ నెల 19న హార్సిలీహిల్స్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం, పీడీడీఆర్‌ డీఏ సత్యనారాయణ, జీఎస్‌డబ్ల్యూఎస్‌ శాఖ అధికారి లక్ష్మీపతి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని పాదయాత్ర

సిద్దవటం: కేంద్ర ప్రభుత్వం గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ రాజస్తాన్‌కు చెందిన రాహుల్‌చౌదరి పాదయాత్ర చేపట్టారు. ఆయన మంగళవారం సిద్దవటానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భరత్‌పుర్‌ జిల్లా జోట్రోలి గ్రామానికి చెందిన తాను తమ గ్రామం నుంచి 2024 సెప్టెంబర్‌ 11న పాదయాత్ర ప్రారంభించానని తెలిపారు. రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌ చేరుకున్నానన్నారు. ఇప్పటి వరకు 264 రోజుల పాటు పాదయాత్ర చేశానన్నారు. ఇంకా తమిళనాడు, జార్ఖండ్‌, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‌, నేపాల్‌ మీదుగా ఉత్తరాంచల్‌ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని వివరించారు.

సిద్దవటంలో

వైద్య సిబ్బంది పర్యటన

సిద్దవటం : మండల కేంద్రం పరిధి పోలీసు లైన్‌ సమీపంలోని వీధిలో వైరల్‌ ఫీవర్‌ రావడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. పి.కొత్తపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్‌ రంగలక్ష్మి, మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి ఇండ్లు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో బుధవారం మలేరియా వ్యతిరేక నివారణ వారోత్సవాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగి ంది. ఈ సందర్భంగా వారు దోమల నివారణకు ఇంటింటా స్ప్రేయింగ్‌ చేయించి మురుగు నీరు ఉన్న ప్రాంతాల్లో నీటిని తొలగించి బ్లీచింగ్‌ చల్లించారు. అంతేగాకుండా పాత టైర్లలో, కూలర్‌లలో నీరు నిల్వ ఉండటంతో వాటిని తొలగించి అబెట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. అనంతరం మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి సుబ్బరాయుడు మాట్లాడుతూ ఈ మలేరియా జూలై నుంచి నవంబర్‌ వరకు జ్వరాలు ఎక్కువగా రావడం జరుగుతుందన్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా దోమలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రతి ఒక్కరూ దోమ తెరలను వాడాలన్నారు. పూల కుండీలు, పాత టైర్లు, డిస్‌పోజల్‌ గ్లాసులు, పాత డబ్బాలలో వ్యర్థాలతో కూడి మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. అలాగే వాతావరణంలో మార్పుల వల్ల వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయన్నారు. విరేచనాలు అయితే ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని తీసుకోవడమే కాక పరిశుభ్రతను పాటించాలన్నారు. కార్యక్రమంలో పి.కొత్తపల్లె పీహెచ్‌సీ సీహెచ్‌ఓ లక్ష్మీనరసమ్మ, సూపర్‌వైజర్లు పద్మావతి, మౌలాలి, ఏఎన్‌ఎం శారద, ఆశా వర్కర్‌ ఓబులమ్మ, ప్రజలు పాల్గొన్నారు.

20న జాబ్‌మేళా  1
1/1

20న జాబ్‌మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement