
కుక్క అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్
గాలివీడు : ద్విచక్రవాహనం అదుపు తప్పి కింద పడటంతో హేమంత్ కుమార్ నాయుడు, రామ్మోహన్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. హేమంత్ కుమా ర్ నాయుడు, రామ్మో హన్ ఇద్దరూ ద్విచక్రవాహనంపై గాలివీడుకు వస్తుండగా మార్గమధ్యంలో కుషావతి నదివద్దకు రాగానే కుక్క అడ్డు రావడంతో ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడ్డారు. ఇద్దరికీ ముఖం, శరీరంపై గాయాల కారణంగా రక్తస్రావం కావడంతో వెంటనే 108 వాహనంలో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి 108 సిబ్బంది ఈఎంటీ ఖాదర్ బాషా, పైలట్ రామాంజులు ప్రథమచికిత్స చేశారు.
ఇద్దరికి గాయాలు