
● 12350 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
గుర్రంకొండ: ఇటీవల కురుస్తున్న వర్షాలు, మారిన వాతావరణం కారణంగా.. జిల్లాలోని టమాటా తోటలు దెబ్బతిన్నాయి. నల్లమచ్చలు, ఊజిరోగాలతో పంట దిగుబడి తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే ధరలు పుంజు కొంటుండటంతో రైతుల ఆశలు చిగురించాయి. అయితే పంట దెబ్బతిని దిగుబడులు తగ్గిపోవడంతో వారి ఆశలు అడియాసలుగా మారాయి.
నల్లమచ్చలు, ఊజిరోగాలతో దెబ్బతిన్న తోటలు
వరుసగా కురుస్తున్న వర్షాలు, మరోవైపు మారు తున్న వాతావరణం దెబ్బకు టమాటా తోటలకు నల్లమచ్చలు, ఊజి, గజ్జి రోగాలు ఆవహించడంతో పంట భారీగా దెబ్బతినింది. చెట్టులోని కాండం, ఆకులు, పిందెలు, చిన్నసైజు కాయలకు నల్లమచ్చ లు ఏర్పడ్డాయి. కాయల సైజు పెరిగినా మచ్చలు అలాగే ఉంటున్నాయి. దీంతో వీటికి మార్కెట్లో డిమాండ్ లేకపోతోంది. ఊజీ రోగాలతో ప్రస్తుతం తోటల్లో ఉన్న కాయలకు రంధ్రాలు ఏర్పడుతున్నాయి. ఊజి ఈగలు, ఆకుమడుత రోగాలు చెట్టును, ఆకుల్ని సైతం పీల్చి పిప్పిచేస్తున్నాయి.
30 శాతం మేరకు నల్లమచ్చలున్న టమాటాలే
మంచి కాపు మీదున్న టమాటా తోటలు వర్షాల ప్రభావానికి గురై 30 శాతం మేరకు కాయలు దెబ్బతిన్నాయి. వివిధ రకాల రోగాలు సోకి తోటల్లో కాయలు దెబ్బతిన్నాయి. తోటల్లో కాయల కోత సమయంలో వంద క్రీట్లకు గాను 30 క్రీట్లు నల్లమచ్చలున్న టమాటాలే ఉండటం గమనార్హం. వీటిని ప్రత్యేకంగా మామూలు టమాటాల నుంచి వేరు చేసి.. మార్కెట్కు తరలించాలంటే తలప్రాణం తోకకు వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో చేసేదిలేక నల్లమచ్చలున్న కాయల్ని పొలాల వద్ద రోడ్ల పక్కనే పారబోస్తున్నారు.
రెడ్డివారిపల్లెలో వర్షాలకు దెబ్బతిన్న టమాటా తోట
28000 45000 12350 16
వర్షాలకు తెగుళ్లు సోకి దెబ్బతిన్న పంట
నల్లమచ్చలు, ఊజి రోగంతో నాణ్యత లోపం
ధర పుంజుకొంటున్నా తగ్గుతున్న దిగుబడి
లబోదిబోమంటున్న రైతులు
జిల్లా వ్యాప్తంగా 12,350 ఎకరాల్లో టమాటా పంటలు దెబ్బతిన్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలకు ఒక్కసారిగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోగాలు సోకిన పంటల కాయలు రూపురేఖలు మారిపోయాయి. ఓవైపు నల్లమచ్చలు, మరోవైపు రంధ్రాలున్న కాయలు ఎక్కువగా వస్తున్నాయి. వీటికి తోడు పలు చోట్ల కాయలు, పిందెలు రాలిపోయి కాలువల్లో పడిపోయాయి.

● 12350 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

● 12350 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

● 12350 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

● 12350 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు