ముగిసిన వైఎస్సార్‌సీపీ పీఏసీ సమావేశం | YSRCP PAC Meeting In Tadepalli July 29th 2025 Updates, More Details Inside | Sakshi
Sakshi News home page

ముగిసిన వైఎస్సార్‌సీపీ పీఏసీ సమావేశం

Jul 29 2025 10:45 AM | Updated on Jul 29 2025 1:30 PM

YSRCP PAC Meeting July 29th 2025 Updates

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సమావేశం ముగిసింది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీటింగ్‌ జరిగింది.

ఈ సమావేశంలో ఏపీ సమకాలీన రాజకీయ అంశాలు, బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ(రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో) కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో వైఎస్‌ జగన్‌ చర్చించారు. పలువురు పార్టీ సీనియర్‌ నేతలు సైతం ఈ మీటింగ్‌కు హాజరయ్యారు.

జగన్‌ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళన వ్యక్తం అయ్యింది. ఇక నుంచి ఈ విషయంలో రాజీ పడొద్దని పలువురు సభ్యులు ఆయన్ని కోరారు. అదే సమయంలో.. ఆయన కూటమి పాలనలో నడుస్తున్న కక్షపూరిత రాజకీయాలపైనా మాట్లాడారు. 

YS జగన్ అధ్యక్షతన భేటీకానున్న పొలిటికల్ అడ్వైజరీ కమిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement