కేంద్ర ఆరోగ్య మంత్రిని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు | YSRCP MPs Meet Union Health Minister Mansukh Mandaviya | Sakshi
Sakshi News home page

కేంద్ర ఆరోగ్య మంత్రిని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

Jul 29 2021 5:58 PM | Updated on Jul 29 2021 6:37 PM

YSRCP MPs Meet Union Health Minister Mansukh Mandaviya - Sakshi

కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాను వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీలో గురువారం కలిశారు. రాజమండ్రిలో నీట్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాను వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీలో గురువారం కలిశారు. రాజమండ్రిలో నీట్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 13 వేల మంది నీట్ అభ్యర్థులున్నారు. పరీక్ష కోసం 200-300 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఏపీలో 11 నీట్ సెంటర్లున్నా.. ఉభయగోదావరి జిల్లాలో ఒక్కటి కూడా లేదు. నీట్ పరీక్ష కోసం విజయవాడ, విశాఖ వెళ్లాల్సి వస్తోందని’’ కేంద్రమంత్రికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement