టెలి మెడిసిన్‌ సేవలపై ఆరా తీయండి: సీఎం జగన్‌

YS Jagan Review Meeting About Coronavirus In Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి : కోవిడ్‌-19 నివారణా చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా పరీక్షలు బాగా చేస్తున్నామన్నారు. చేస్తున్న పరీక్షల్లో 85 శాతం నుంచి 90 శాతం క్లస్టర్లు ఉన్న ప్రాంతాల్లోనే చేస్తున్నాం.. 104, 14410 కాల్‌ సెంటర్లు సమర్థవంతగా పనిచేయాలన్నారు. ఈ రెండు నంబర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అన్నది అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అధికారులకు వెల్లడించారు. ప్రజలు కాల్‌ చేసిన వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలన్నారు.

టెలిమెడిసిన్‌ సేవలపై ఆరా తీయండి :
139 ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో భోజనం ,పారిశుద్ధ్యంపై సీఎం జగన్‌ ఆరా తీయగా.. మెనూ కచ్చితంగా అమలు చేసేలా చూస్తున్నామన్న అధికారులు పేర్కొన్నారరు. దీనివల్ల నాణ్యమైన భోజనం అందుబాటులోకి వస్తోందని అధికారులు తెలిపారు.  టెలిమెడిసిన్‌ కింద మందులు పొందిన వారికి మళ్లీ పోన్‌చేసి సేవలపై ఆరా తీయాలని అధికారులకు తెలిపారు. సేవల్లో స్థిరత్వం ఉండాలని, వ్యవస్థలు ఉన్నట్టు ఉంటాయి గాని, అవి స్థిరంగా పనిచేస్తున్నాయా? లేదా? అనేదానిపై పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండాలన్నారు. అధికారులు అప్పుడప్పుడూ కాల్‌చేసి అవి పనిచేస్తున్నాయా? లేదా? అని చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని జగన్‌ పేర్కొన్నారు. కాల్‌ సెంటర్‌ సేవలపైన ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయాలని.. ఎప్పటికప్పుడు వస్తున్న లోపాలను సరిదిద్దుకోవాలన్నారు.  ఎదురవుతున్న లోపాలను అంగీకరించి వాటిని సరిదిద్దుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమన్నారు. అవసరాలకు అనుగుణంగా అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలన్నారు.('పోలీసులంటే జేసీ బ్రదర్స్ కు ఎందుకంత చులకన')

స్కూళ్లు తెరిచే సమయానికి పిల్లలకు మాస్కులు ఇవ్వాలన్నారు. జగనన్న విద్యాకానుక ఇచ్చే సమయానికి మాస్కులు కూడా ఇవ్వాలి..  కోవిడ్‌ ఆస్పత్రుల్లో సేవలపైన కూడా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని సీఎం జగన్‌ వెల్లడించారు. ఆయా అంశాల్లో సేవలు ఎలా ఉన్నాయన్న దానిపై పీడ్‌ బ్యాక్‌  తీసుకోవాలని .. గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టర్లు పెట్టాలన్నారు. ఆరోగ్య శ్రీ సేవలందిస్తున్న ఆస్పత్రులు, ఇతర వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఏఎన్‌ఎం ఆరోగ్యశ్రీకి రిఫరెల్‌ పాయింట్‌గా ఉండాలన్నారు. 

ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయండి :
కోవిడ్‌ ఆస్పత్రుల వివరాలు కూడా ఈ పోస్టర్‌లో ఉండాలని.. వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై ఏఎన్‌ఎం తగిన విధంగా మార్గనిర్దేశం చేయాలని తెలిపారు.  దీంట్లో వాలంటీర్‌ భాగస్వామ్యం కూడా ఉండాలని.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వద్దా కోవిడ్‌ సోకిందని అనిపిస్తే ఏం చేయాలన్నదానిపై హోర్డింగ్స్, పోస్టర్లు పెట్టించాలన్నారు. కోవిడ్‌ ఉన్నట్టుగా అనుమానం ఉంటే.. ఏం చేయాలన్నదానిపై ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని.. కోవిడ్‌ నివారణా చర్యల్లో ఎమ్మెల్యేల భాగస్వామ్యం తీసుకోవాలని.. ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top