అబ్దుల్‌ సలాం కుటుంబానికి సీఎం అండ

YS Jagan Govt Support To Abdul Salam Family - Sakshi

కుటుంబ సభ్యురాలికి ఉద్యోగం

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అన్నివిధాలా అండగా నిలిచారు. అబ్దుల్‌ సలాం అత్త మాబున్నీసా మనవరాలు రేష్మకు పశుసంవర్థక శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగం ఇచ్చారు. ఈ మేరకు నియామక పత్రాన్ని శుక్రవారం నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ జేడీ రమణయ్య ఆమెకు అందజేశారు.

అబ్దుల్‌ సలాం భార్యా పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అతని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హామీ మేరకు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆదుకున్నారు. ముఖ్యమంత్రికి తమ కుటుంబం రుణపడి ఉంటుందని సలాం అత్త మాబున్నీసా, ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top