వివాహే­తర సంబంధం.. చిన్నారిపై తల్లి పైశాచికం | Women Relationship With Other Man | Sakshi
Sakshi News home page

వివాహే­తర సంబంధం.. చిన్నారిపై తల్లి పైశాచికం

Apr 7 2025 12:06 PM | Updated on Apr 7 2025 12:06 PM

Women Relationship With Other Man

చిట్టినగర్‌ (విజయవాడ పశ్చిమ): మూడేళ్ల చిన్నారిపై తల్లి పైశాచికంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విజయ­వాడ పరిధిలోని జక్కంపూడి కాలనీలో నివసించే వందనకు (23) అమ్ములు అనే మూడేళ్ల పాప ఉంది. కొన్ని నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది.

 శ్రీరాములు అనే వ్యక్తితో వివాహే­తర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో వందన, శ్రీరాములు హైదరాబాద్‌కు మకాం మా­ర్చారు. తమ ఆనందానికి పాప అడ్డుగా ఉందని భావించిన వారు.. ఆ చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. వంటిపై, వీపుపై ఇష్టాను­సారంగా వాతలు పెట్టడంతో ఆ చిన్నారి కేకలు వేసేది. 

కేకలు బయటకు రాకుండా నోరు మూ­సి ఈ అకృత్యాలకు పాల్పడి­నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం విజయవాడ వచ్చిన వందన, శ్రీ­రాములు పాపను రైల్వే స్టేషన్‌లో వదిలేశారు. విషయం తెలుసుకున్న శ్రీరాము­లు తల్లి సుమ­లత రైల్వేస్టేషన్‌కు వెళ్లి అమ్ము­లును ఇంటికి తీసుకొచ్చింది. కాగా, ఈ అకృత్యాలు తెలుసు­కున్న స్థానికులు విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement