ఆ విమానం సీఎం రమేష్‌ది.. | Venkatesh Naidu travelled in CM Rameshs plane | Sakshi
Sakshi News home page

ఆ విమానం సీఎం రమేష్‌ది..

Aug 6 2025 6:10 AM | Updated on Aug 6 2025 6:24 AM

Venkatesh Naidu travelled in CM Rameshs plane

వెంకటేష్‌ నాయుడు ప్రయాణించింది అందులోనే

చంద్రబాబు సహా టీడీపీ ముఖ్య నేతలందరితోనూ సంబంధాలు

వారందరితో దిగిన ఫొటోలే ఇందుకు నిదర్శనం

అయినా వైఎస్సార్‌సీపీ నేతలకు సన్నిహితుడని టీడీపీ బుకాయింపు

సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ అభాసు­పాలై డైవర్షన్‌ వ్యవహారాలకు తెరదీస్తున్న కూ­టమి ప్రభుత్వం తాజాగా మరో తప్పు­ట­డుగు వేసింది. ఈ కేసులో ఒక నిందితుడైన వెంకటేష్‌ నాయుడు ఉపయోగించిన ప్రత్యేక విమా­నం బీజేపీకి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌­దనే విష­యం బయటపడడంతో టీడీపీ అభాసుపాలైంది. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ గ్రీన్‌ పవర్‌ అండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వి­మా­నంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 13న వెంకటేశ్‌ నాయుడు హైదరాబాద్‌ నుంచి కో­యంబత్తూరుకు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. 

హైదరా­బాద్‌కు చెందిన మధు క్రియేషన్స్‌ రూ.17 లక్షలతో ఈ విమానం టి­కెట్‌ను బుక్‌ చేసింది. వీటీ వీఐఎన్‌ టైప్‌కి చెందిన ఈ ప్రత్యేక వి­మానంపై సీఎంఆర్‌ (సీఎం రమేష్‌) అనే పేరు కూడా రా­సి ఉంది. అందులోనే సినీ నటి తమన్నా కూడా ప్రయాణించారు. ఆమె పక్క సీటులో కూర్చున్న వెంకటేష్‌ నాయుడి ఫొటోలను మా­త్ర­మే సిట్‌ వి­డుదల చేసి తప్పుడు ప్రచారం చేసింది. దీంతో వెంక­టేష్‌ నాయు­డు వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలకు ప్రధాన అనుచరుడని టీడీపీ నేతలు, సిట్‌ చేసిన ప్రచారం అంతా తప్పని తేలిపోయింది. 

సీఎం రమేష్‌ చంద్రబాబుకు అత్యంత సన్ని­హితుడు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు ఆ­యన్ను బీజేపీ­లోకి పంపారు. రమేష్‌ బీజేపీ­లో ఉండి చంద్రబాబు కో­సం పని చేస్తున్నారనే విష­యం కూడా తెలిసిందే. మద్యం అక్రమ కేసులో వైఎస్సార్‌­సీపీ నేతలపై ఎడా­పెడా బురద జ­ల్లే క్రమ­ంలో సిట్, ఎల్లో మీడి­యా.. వెంకటేష్‌ నా­యుడు డబ్బు లెక్కిస్తున్న ఎప్పటివో పా­త వీడి­యోలు విడుదల చేసి దుష్ప్రచారం చేస్తు­న్నా­రు. కానీ ఇప్పుడు అతను టీడీపీకే అ­త్య­ంత అనుకూ­ల వ్యక్తని తే­లిపోయింది. 

సీఎం ర­మేష్‌ విమా­నాన్ని ఉప­యో­గించడమే కాదు..చంద్ర­బాబు, లో­కేశ్, బాలకృష్ణ, టీడీపీకి చెందిన కేంద్ర మంత్రు­లు రామ్మోహన్, పెమ్మసా­నితో వెంకటేష్‌ సన్నిహి­తంగా ఉన్న ఫొటోలు వైరల­య్యాయి. హైదరా­బాద్‌­లో దొరికి­నట్లు చెబు­తున్న రూ.­11 కోట్ల వ్యవ­హా­రంలో బుక్కయిన టీడీపీ.. దాన్ని డైవర్ట్‌ చేయడం కోసం వెంకటేష్‌ వీడి­యోలు విడుదల చేసిందని స్పష్ట­మైంది. ఇప్పుడీ వ్యవహారమూ బెడిసికొట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement