సుందరం.. శోభాయమానం

TTD Officials Are Making Arrangements For The Srivari Brahmotsavam - Sakshi

19 నుంచి 27వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు 

కోవిడ్‌ నిబంధనల మేరకు ఏకాంతంగానే సేవలు 

ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ అధికారులు  

సాక్షి, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండను ముస్తాబు చేస్తున్నారు. ఏడుకొండలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన గోపురంతోపాటు ఇతర ఆలయాలకు మెరుగులు దిద్దారు. మాడవీధులలో శోభాయమానంగా రంగవల్లులు వేయించారు. టీటీడీ గార్డెనింగ్‌ విభాగం ఆధ్వర్యంలో వివిధ పుష్పాలతో ఆలయ ప్రాకారాలను అలంకరిస్తున్నారు. విద్యుద్దీపాల వెలుగులో తిరుగిరి కాంతులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేశారు. ఘాట్‌రోడ్‌కు మరమ్మతులు చేసి పిట్టగోడలకు రంగులు వేస్తున్నారు.
   


ఆలయం ఎదుట రంగవల్లిక..                                     

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top