పెళ్లయిన 24 గంటల్లోనే వరుడు దుర్మరణం | Tragedy in East Godavari District | Sakshi
Sakshi News home page

పెళ్లయిన 24 గంటల్లోనే వరుడు దుర్మరణం

Sep 9 2026 5:46 AM | Updated on Sep 9 2026 5:46 AM

Tragedy in East Godavari District

స్కూటీపై వెళుతుండగా ఢీకొన్న అంబులెన్స్‌ 

ప్రమాదంలో స్నేహితుడు కూడా కన్నుమూత 

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం 

పెరవలి: పెళ్లయిన 24 గంటలు కూడా గడవకముందే వరుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం తూర్పుగోదావరి జిల్లా, పెరవలి మండలం పిట్టల వేమవరం ప్రాంతంలో తీవ్ర వి­షాదాన్ని నింపింది. స్కూటీపై స్నేహితు­డితో కలిసి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన అంబులెన్స్‌ ఢీకొనడంతో ఇద్దరూ మృతిచెందారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. పిట్టల వేమవరం గ్రామానికి చెందిన నేలపూడి ప్రదీప్‌ (24)కు అదే గ్రామానికి చెందిన యువతితో సోమవారం మధ్యాహ్నం వివాహం జరిగింది. 

ఈ క్రమంలో అన్నవరప్పాడు సెంటర్‌లో దిగిన స్నేహితుడు హరిదాసు సాయి (21)ను స్కూటీపై ఎక్కించుకుని తీసుకువస్తుండగా ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ఎగిరి పక్కనే ఉన్న రాళ్ళగుట్టపై పడ్డారు.  స్థానికులు వెంటనే వారిని ఢీకొట్టిన అంబులెన్సులోనే ఆస్పత్రికి తరలించారు. వరుడు అంబులెన్సులో ఎక్కించకముందే మృతిచెందగా, కొన ఊపిరితో స్నేహితుడు తణుకు ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్న ప్రదీప్‌ పెళ్లికోసం సెలవుపెట్టి నెల రోజుల క్రితమే గ్రామానికి రావడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement