రాష్ట్రంలో డాక్టర్లు 52,341

There Are 52341 Doctors In AP - Sakshi

ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో వివరాలు నమోదు

17,795 మంది స్పెషలిస్టులు, 34,546 మంది ఎంబీబీఎస్‌ వైద్యులు

గుంటూరు జిల్లా నుంచి అత్యధికంగా 7,491 మంది డాక్టర్లు

విజయనగరం నుంచి అత్యల్పంగా 1,172 మంది

గత ఏడాదిన్నరలో పెద్ద ఎత్తున వైద్య సిబ్బంది నియామకాలు 

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటైన ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో ఇప్పటివరకు 52,341 మంది వైద్యులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 34,546 మంది ఎంబీబీఎస్‌ వైద్యులు కాగా 17,795 మంది స్పెషలిస్టులున్నారు. గుంటూరు జిల్లా నుంచి అత్యధికంగా 7,491 మంది వైద్యుల పేర్లు నమోదయ్యాయి. విశాఖ, కృష్ణా జిల్లాలు తరువాత స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లా నుంచి 1,172 మంది పేర్లు నమోదయ్యాయి. ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారిలో 12.67 % మంది మాత్రమే పేర్లు నమోదు చేసుకున్నారు. 

ఏడాదిన్నరలో భారీగా నియామకాలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 1,550 మంది వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టింది. వీరిలో స్పెషలిస్టు వైద్యులే 695 మంది ఉన్నారు. మరో 700 మంది ఎంబీబీఎస్‌ డాక్టర్లున్నారు. మిగతా వారు డిప్లొమాతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top